రూ.8.5కోట్లతో దుద్దెడ జంక్షన్ అభివృద్ధి

by  |
రూ.8.5కోట్లతో దుద్దెడ జంక్షన్ అభివృద్ధి
X

దిశ, మెదక్: రాజీవ్ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో రాజీవ్ రహదారిపై గురువారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. దుద్దెడ జంక్షన్ అభివృద్ధికి రూ.8.5కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయని వివరించారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం పూర్తయిందని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. సమీక్షలో ఈఎన్సీ ఆశారాణి పాల్గొన్నారు.


Next Story

Most Viewed