రూ.750 కోట్లతో లక్ష కల్లాలు

by  |
రూ.750 కోట్లతో లక్ష కల్లాలు
X

దిశ, మెదక్: రాష్ట్రవ్యాప్తంగా రూ.750 కోట్ల నిధులతో లక్ష కల్లాలను నిర్మించబోతున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం సిద్దిపేటలోని సీసీ గార్డెన్స్‌లో చిన్నకోడూర్, నారాయణరావుపేట మండలాల్లోని 350 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.60 వేలు, 70 వేలు, 86 వేల రూపాయలతో మూడు కేటగిరిల్లో కల్లాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, మిగతా వారికి 90 శాతం సబ్సిడీపై ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు.


Next Story

Most Viewed