ప్రతిపక్ష పార్టీలు సిగ్గుపడాలి: ఎర్రబెల్లి

by  |
ప్రతిపక్ష పార్టీలు సిగ్గుపడాలి: ఎర్రబెల్లి
X

దిశ‌ ప్రతినిధి, వ‌రంగ‌ల్: అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్ర‌తిప‌క్షాలు ఉండ‌టం తెలంగాణ ప్ర‌జ‌లు చేసుకున్న దుర‌దృష్ట‌మ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా శాయంపేట మండ‌లం కొత్త‌గ‌ట్టు సింగారం, ప్ర‌గ‌తి సింగారం గ్రామాల్లో శుక్రవారం గ్రామ పంచాయ‌తీ నూత‌న భ‌వ‌నాల‌ను మంత్రి ప్రారంభించారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి రైతాంగానికి సాగునీరు అందిస్తుంటే.. కేసులు వేసి అడ్డుకుంటున్నాయ‌ని ప్ర‌తిప‌క్షాలపై విమర్శలు గుప్పించారు. ప్ర‌గ‌తిని అడ్డుకుంటున్న ప్ర‌తిప‌క్ష పార్టీలు సిగ్గుప‌డాల‌ని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాల్లో రూరల్ జిల్లా చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎంపీ బండా ప్ర‌కాశ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.


Next Story