వాళ్లకు ఇంట్లో వాళ్లే ఓటు వేయరు

by  |
వాళ్లకు ఇంట్లో వాళ్లే ఓటు వేయరు
X

దిశవెబ్ డెస్క్: కాంగ్రెస్, బీజేపీ నాయకులకు వాళ్ల ఇంట్లో వాళ్లే ఓట్లు వేయరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో నిర్వహించిన వరంగల్, ఖమ్మం,నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే ధర్మారెడ్డితో కలిసి ఆయన ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్, బీజేపీలకు బుద్ది చెప్పాలని యువకులను ఆయన కోరారు. మన పథకాలను చూసి కేంద్రం ప్రశంసిస్తోందని అన్నారు. కానీ ఇక్కడి బీజేపీ నాయకులకు మాత్రం కండ్లు కనిపించడం లేదని ఆయన అన్నారు.


Next Story