నిధులు, ప్రోత్సాహకాల కోసమే !

by  |
నిధులు, ప్రోత్సాహకాల కోసమే !
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ర్టానికి రావాల్సిన నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాల గురించి కేంద్ర మంత్రులను కలిసినట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్​రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిల గురించి అడిగారు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటుకు నిధులు సమకూర్చాలని కోరారు. ప్రత్యేక హోదా అంశాన్ని గురించి ప్రస్తావించారు. కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించినట్లు బుగ్గన మీడియాకు వెల్లడించారు. కేంద్రమంత్రులను కలిసిన వారిలో బుగ్గనతోపాటు ఎంపీలు కృష్ణదేవరాయులు, కోటగిరి శ్రీధర్, ప్రభుత్వ సలహాదారు అజయ్​కల్లం ఉన్నారు.


Next Story

Most Viewed