రాజధానిపై చంద్రబాబుది వీధినాటకం

by  |
రాజధానిపై చంద్రబాబుది వీధినాటకం
X

దిశ, వెబ్‌డెస్క్: రాజధానిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. రాజధాని విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలన్న చంద్రబాబుది వితండవాదం అన్నారు. ఏదైనా సమస్యపై పోరాటం చేయాలంటే రాజీనామా చేసి వెళ్లాలని చంద్రబాబుకు సూచించారు. 48 గంటల తరువాత చంద్రబాబు ఏం చెప్పారో ఎవరికీ అర్థం కాలేదన్నారు.

చంద్రబాబు ఎప్పుడైనా మాట మీద నిలబడ్డారా అని బొత్స ప్రశ్నించారు. ఆయన జిమ్మికులు అందరికీ తెలుసన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా జగన్ ముందుకు వెళ్తున్నట్లు బొత్స పేర్కొన్నారు. ఇప్పటికే ఇచ్చిన ప్రతి హామీని జగన్ అమలు చేశారని బొత్స గుర్తు చేశారు. రాజధానిపై కేంద్రం స్పష్టమైన వైఖరి తెలియజేయడంతో చంద్రబాబు వీధినాటకం మొదలెట్టారని బొత్స విమర్శించారు.


Next Story

Most Viewed