కౌలు చెల్లించినా రెచ్చగొడుతున్నారు: బొత్స

by  |
కౌలు చెల్లించినా రెచ్చగొడుతున్నారు: బొత్స
X

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రైతుల కౌలు డబ్బులు వారి ఖాతాలో జమ చేసినట్లు మంత్రి బొత్స తెలిపారు. సాంకేతిక కారణాలతో కౌలు జమ చేయడం ఆలస్యమైందన్నారు. కౌలు రైతులకు పింఛన్ రూ.5000 కు పెంచాలనుకున్నామని.. అయితే ఈ వ్యవహారంపై కోర్టులో కేసు పెండింగ్ లో ఉండటంతో సాధ్యపడలేదన్నారు.

గురువారం విజయనగరంలోని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఆక్సిజన్‌ కిట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రైతులకు కౌలు చెల్లించినా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని బొత్స విమర్శించారు. కాగా, కౌలు చెల్లింపులో జాప్యం ఏర్పడటంతో విజయవాడలోని ఏఎంఆర్‌డీఏ కార్యాలయాన్ని రైతులు ముట్టడించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed