అభివృద్ధికి చంద్రబాబు అడ్డు: అవంతి

by  |
అభివృద్ధికి చంద్రబాబు అడ్డు: అవంతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అభివృద్ధికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని వైసీపీ నేత, మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అమరావతి రాజధాని తరలింపు అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోకి వస్తోందని కేంద్రం స్పష్టం చేసినా.. టీడీపీ నేతలు అనవసర ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా టెస్టులు చేయిస్తున్నామన్న ఆయన.. మహమ్మారి పై మానవాళి విజయం సాధిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కరోనా కాలంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతో సేవ చేశారని.. రక్తదానం కూడా చేశారన్నారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవకార్యక్రమాలు చేపట్టారని అవంతి శ్రీనివాస్ కొనియాడారు.


Next Story

Most Viewed