డ్రైవర్ కుటంబాన్ని ఆదుకుంటాం: అల్లోల

by  |
డ్రైవర్ కుటంబాన్ని ఆదుకుంటాం: అల్లోల
X

దిశ, వెబె డెస్క్: మెదక్ జిల్లా చేగుంట వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ విశ్వనాథం మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఉదయం ప్రమాద స్థలిని పరిశీలించారు. గాయ‌ప‌డ్డ ప్ర‌యాణికుల ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు. డ్రైవ‌ర్ విశ్వ‌నాథం కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. బస్సు హైదారాబాద్ నుంచి నిర్మల్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.


Next Story

Most Viewed