శ్రీరాంసాగర్ జలాశయాన్ని సందర్శించిన మంత్రి..!

by  |
శ్రీరాంసాగర్ జలాశయాన్ని సందర్శించిన మంత్రి..!
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుంది. దీంతో ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువలైన కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలతో పాటు వరద కాలువకు నీటి విడుదల కొనసాగతోంది. ఈ మేరకు జలాశయానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి.. ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ రామ్‎కిషన్‎రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, నాయకులు ఉన్నారు.


Next Story

Most Viewed