బక్రీద్ పండగ, తెలంగాణకు త్యాగాలే పునాదులు

by  |
బక్రీద్ పండగ, తెలంగాణకు త్యాగాలే పునాదులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: బక్రీద్ పండుగకు, తెలంగాణ రాష్ట్రానికి చాలా సారూప్యత ఉందని, రెండిటికీ త్యాగాలే పునాదులని రవాణా‌మంత్రి అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారని కొనియాడారు. ఈ మేరకు బక్రిద్ పండుగ సందర్భంగా తెలంగాణ ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా మైనారిటీలకు షాదిముబారక్, ప్రత్యేక గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీం, ఉర్దూ భాషకు మొదటి లాంగ్వేజ్ ఆప్షన్ భాషగా గుర్తింపు, ఉర్దూలో డీఎస్సీ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని గుర్తుచేశారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని ముస్లిం ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పౌరులందరూ లౌకిక స్ఫూర్తిని కలిగి ఉండాలని కోరారు.



Next Story