7 నుంచి మెట్రోరైళ్లు ప్రారంభం

by  |
7 నుంచి మెట్రోరైళ్లు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో, ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, రైళ్లు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈనెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లు నడపటానికి ఏర్పాట్లు పూర్తి చేసింది.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, రైళ్లలో ప్రత్యేక శానిటైజేషన్ ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కాగా గ్రేడెడ్ పద్ధతిలో నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవసరమైన జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.


Next Story