మీరా మిథున్ దిష్టిబొమ్మ దహనం..

by  |
మీరా మిథున్ దిష్టిబొమ్మ దహనం..
X

హీరోయిన్ మీరా మిథున్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది. ఇన్నాళ్లు స్టార్ హీరోయిన్ త్రిషను టార్గెట్ చేసిన ఈ భామ.. తన వల్లే అవకాశాలు కోల్పోయానని ఆరోపించిన విషయం తెలిసిందే. మూవీ మాఫియాతో త్రిషకు సంబంధాలున్నాయని వ్యాఖ్యానించిన మీరా.. త్వరలో కోలీవుడ్ బండారం బయటపెడతానని చెప్పింది. అంతటితో ఆగకుండా రజనీకాంత్, సూర్య, విజయ్‌లను కూడా టార్గెట్ చేసింది. వీరి వల్ల చాలా మంది నటులకు అవకాశాలు రావడం లేదని, మాఫియాను నడుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.

దీంతో కథానాయకులను దేవుళ్ళుగా భావించే కోలీవుడ్ అభిమానులు మీరా దిష్టిబొమ్మను దహనం చేశారు. దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ ఊరేగించారు. ‘కలాం జీ’ అనే సంస్థ ఆధ్వర్యంలో అభిమానులు మీరా దిష్టిబొమ్మను తగలబెట్టగా.. ఈ ఘటనను కోలీవుడ్ మీడియా ప్రచారం చేసింది. దీంతో ఈ వార్తపై మండిపడింది మీరా.

కలాం జీ పేరు పెట్టుకుని.. ఇలాంటి పనులు చేసేందుకు బుద్ధి లేదా? అంటూ తిట్టిపోసింది. ఇదంతా సూర్య, విజయ్‌ల పనే అన్న మీరా.. కమెడియన్ వడివేలు సినిమాల్లో నటించడం మానేయడంతో ఇప్పుడు ఆ ప్లేస్‌ను సూర్య, విజయ్ అభిమానులు భర్తీ చేస్తున్నారని కామెంట్ చేసింది.



Next Story