- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్ :లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రోడ్లపై ఉమ్మి వేస్తే ఆ వ్యక్తులను డ్రోన్ కెమెరాల ద్వారా పట్టుకొని జరిమానా విధిస్తామని సిద్దిపేట సీపీ జోయల్ దేవిస్ హెచ్చరించారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటకి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు, కర్చీఫ్, రుమాలు తప్పకుండా కట్టుకొని రావాలని లేదంటే చర్యలు తప్పవన్నారు. కరోనాను అరికట్టడంలో భాగంగా సిద్దిపేట జిల్లా సరిహద్దులో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24 పికెట్లు, 880 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 190 మంది పాస్పోర్టులు సీజ్ చేశామని నిబంధనలను ఉల్లంఘించి దుకాణాలు తెరిచిన 81 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. కరోనా నివారణకు కృషి చేస్తున్న ప్రభుత్వ డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Tags : roads, Spitting, lackdown, cp joyal devis, siddipet, vehicils