గ్రేటర్​లో 50 థీమ్​ పార్కుల ఏర్పాటు

by  |
గ్రేటర్​లో 50 థీమ్​ పార్కుల ఏర్పాటు
X

దిశ, న్యూస్​బ్యూరో: ప్రజ‌ల‌కు ఆరోగ్యక‌ర వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించేందుకు న‌గ‌రంలో రూ.123 కోట్లతో 50 థీమ్ పార్కుల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. బుధ‌వారం ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డితో క‌లిసి కాప్రా స‌ర్కిల్‌లో రూ. 16.30 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న ఆరే థీమ్ పార్కుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మేయర్​ బొంతు రామ్మోహన్​ మాట్లాడుతూ థీమ్ పార్కుల్లో యోగా, వాకింగ్ ట్రాక్‌, ఓపెన్ జిమ్‌లు ఇత‌ర స‌దుపాయాల‌ను క‌ల్పించనున్నట్లు తెలిపారు.

ఢిల్లీ, ఇండోర్, బెంగ‌ళూర్ లాంటి ముఖ్య న‌గ‌రాల్లో ఉన్న థీమ్ పార్కుల‌ను ప‌రిశీలించి న‌గ‌రంలో ఏర్పాటు చేస్తున్న థీమ్ పార్కుల‌కు డిజైన్లు రూపొందించిన‌ట్లు తెలిపారు. థీమ్ పార్కుల‌ను స‌క్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ఆయా కాల‌నీవాసుల రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్లపై ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, బయోడైవర్సిటీ అదనపు కమిషనర్ కృష్ణ పాల్గొన్నారు.


Next Story

Most Viewed