చారిత్రాత్మక టెస్టుకు వర్షం అడ్డంకి

by  |
చారిత్రాత్మక టెస్టుకు వర్షం అడ్డంకి
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన క్రికెట్ బుధవారం తిరిగి ప్రారంభం కానుంది. నాలుగు నెలల విరామం తర్వాత ఇంగ్లండ్, విండీస్ జట్ల మధ్య సౌతాంప్టన్‌లోని ఏజెస్ బౌల్ మైదానంలో తొలి టెస్టు జరుగనుంది. కాగా, ఉదయం నుంచి సౌతాంప్టన్ ప్రాంతంలో చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో మైదానం తడవకుండా కవర్స్ కప్పి ఉంచారు. వర్షం పడుతుండటంతో అంపైర్లు ఇంకా టాస్ వేయలేదు. ఔట్‌ఫీల్డ్ కూడా పూర్తిగా తడిచిపోవడటంతో అంపైర్లు వేచి చూస్తున్నారు. బయో బబుల్‌లో నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించలేదు. ఆటగాళ్లు, సహాయక, గ్రౌండ్, హోటల్, బ్రాడ్‌కాస్ట్ సిబ్బంది, అంపైర్లు, మ్యాచ్ అధికారులను మాత్రమే ఏజెస్ బౌల్‌లోకి అనుమతించారు.


Next Story

Most Viewed