ఐపీఎల్.. పంజాబ్‌తో రాజస్థాన్ ఢీ

by  |
ఐపీఎల్.. పంజాబ్‌తో రాజస్థాన్ ఢీ
X

దిశ, వెబ్‌డెస్క్: యూఏఈ వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) రసవత్తరంగా కొనసాగుతోంది. ఊహించని పరిణామాలతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గెలుపు మీద కసితో ఉన్న రెండు జట్ల మధ్య పోరు ఉత్కంఠతను, ఆసక్తిని కలిగిస్తున్నాయి. కాగా ఇవాళ(ఆదివారం) ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అబుదాబి వేదికగా రాత్రి 7:30గంటలకు ప్రారంభం కానుంది. రెండు జట్లు సమాన బాలాలతో బరిలోకి దిగనున్నాయి. పంజాబ్ జట్టు చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరును మట్టికరిపించి, అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా చెన్నై సూపర్ కింగ్స్‌తో చివరి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి, ఘన విజయం సాధించింది. దీంతో రెండు జట్లు ప్రస్తుతం గెలుపు ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్లలో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలు స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. దీంతో ఏ జట్టుపై ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాల్సిందే.



Next Story