గొంతు ఆపరేషన్.. హార్ట్‌స్ట్రోక్ వచ్చిందంటూ..!

by  |
గొంతు ఆపరేషన్.. హార్ట్‌స్ట్రోక్ వచ్చిందంటూ..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని అనంతపురం జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వివాహిత గొంతులో గుడ్డ ఇరుక్కుందని ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఆమె గుండెపోటుతో చనిపోయిందని ఆలస్యంగా తెలిపారు. దీంతో కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఆస్పత్రిలో శనివారం వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగానే వివాహిత చనిపోయిందని బంధువులు ఆరోపిస్తుండగా, డాక్టర్లే తన భార్యను అన్యాయంగా చంపారంటూ భర్త కన్నీరుమున్నీరయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed