ఇకపై రెండు గంటలే మార్కెట్..!

by  |
ఇకపై రెండు గంటలే మార్కెట్..!
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా వ్యాప్తి దృష్ట్యా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రెండు గంటలు మాత్రమే మార్కెట్ తెరిచి ఉంచాలని నిర్ణయించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో.. మంగళవారం నుంచి మార్కెట్, కిరాణం, ఇతర షాపులు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాలని కోరారు. నిబంధలనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.


Next Story

Most Viewed