నలుగురిని చంపిన మావోయిస్టులు..!

by  |
నలుగురిని చంపిన మావోయిస్టులు..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఛత్తీస్‌గఢ్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. బీజాపూర్ జిల్లా గంగలూర్ పరిధిలోని కుర్చేలి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను హతమార్చడమే కాకుండా, మరికొంత మంది గ్రామస్తులను నక్సల్స్ కిడ్నాప్ చేశారని బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాప్ అయిన వారి ఆచూకీ కనుగొనేందుకు కూంబింగ్ మొదలెట్టారు. కాగా, సరిగ్గా ఇలాంటి ఘటనే సెప్టెంబర్ 5న కూడా చోటుకోవడంతో పోలీసులు దీనిని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed