అడవుల్లో ఉత్కంఠ… నేటి నుంచి వారోత్సవాలు

by  |
అడవుల్లో ఉత్కంఠ… నేటి నుంచి వారోత్సవాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా నేటి నుంచి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల ఎదురుకాల్పులు చోటుచేసుకుని, ఇద్దరు మావోలు హతం అయిన సంగతీ తెలిసిందే. అంతేగాకుండా ఈ కాల్పుల్లో తప్పించుకున్న ఇతర మావోలు, కీలక నేత భాస్కర్‌ కోసం పోలీసులకు దాదాపు 400 మంది పోలీసులతో అసిఫాబాద్ అడవుల్లో కుంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ వారోత్సవాలకు పిలుపునివ్వడంతో అడవుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.



Next Story

Most Viewed