వాళ్లిద్దరికి సంచైత డ‌బుల్ స్ట్రోక్

by  |
వాళ్లిద్దరికి సంచైత డ‌బుల్ స్ట్రోక్
X

దిశ, వెబ్‌డెస్క్: తండ్రి ఆస్తిలో కొడుకులతో పాటు కూతుర్లకు కూడా సమానంగా హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు నిన్న చారిత్రాత్మక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దానిని ఉటంకిస్తూ విజయనగరం మాన్సన్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు ట్విట్టర్ వేదికగా తన బాబాయ్ అశోక్ గజపతిరాజు అండ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు డబుల్ స్ట్రోక్ ఇచ్చారు.

సుప్రీంకోర్టు తీర్పును ఆమె రీట్వీట్ చేస్తూ.. ‘మహిళల హక్కుల విషయంలో చంద్రబాబు ఛాంపియన్‌ అయితే… కాస్త మీ పార్టీ నాయకుడు అశోక్ గజపతిరాజుకు చెప్పండి. సింహాచలం, మాన్సస్‌ ట్రస్ట్ మొదటి మహిళా ఛైర్‌పర్సన్‌ ఐన తనపై దాడులకు పాల్పొడొద్దని.. తాను ఆయన అన్నయ్య పెద్దకుమార్తెను, వారసురాలిని.. అది గుర్తించిన సీఎం జగన్ గారికి ధన్యవాదాలు’ అంటూ సంచైత ట్వీట్ చేసింది.

సంచైత ట్వీట్ విషయంలో టీడీపీ శ్రేణులు గరంగరంగా ఉంటే.. వైసీపీ నాయకులు మాత్రం అగ్నికి ఆజ్యం పోసేలా కామెంట్లతో పాటు హాష్ ట్యాగ్‌లతో దానిని వైరల్ చేస్తున్నారు. మొత్తానికి సమయం వచ్చినపప్పుడల్లా తన బాబాయ్‌తో పాటు టీడీపీ అధినేతకు మాన్సస్ చైర్‌పర్సన్ సంచైత విమర్శల బాణాలు విసురుతూనే ఉన్నారు.



Next Story

Most Viewed