- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మోడీ, కేసీఆర్ భేటీపై కిషన్రెడ్డి ఏం చెబుతారు ?
by Shyam |

X
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీలో దోస్తీ.. గల్లీలోకుస్తీ అన్నట్టుగా టీఆర్ఎస్, బీజేపీ వైఖరి ఉందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానించారు. కేసులకు భయపడే కేసీఆర్.. బీజేపీని శరణుకోరారన్న మాణిక్యం ఠాగూర్.. కేసీఆర్ ఫ్యామిలీపై ఆరునెలల పాటు ఐటీ, ఈడీ దాడులు జరగవన్నారు. కేసీఆర్, మోడీ భేటీపై బండి సంజయ్, కిషన్రెడ్డి ఏం చెబుతారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ నుంచి జిల్లా స్థాయివరకు 162మంది అభిప్రాయాలను సేకరించామని, పీసీసీ చీఫ్ ఎంపికపై హైకమాండ్దే తుది నిర్ణయమన్నారు. ప్రజాదరణ లేని నాయకులే కాంగ్రెస్ను వీడుతారని స్పష్టం చేశారు. సంస్థాగతమైన లోపాల వల్లే జీహెచ్ఎంసీలో ఓడిపోయామని, తెలంగాణలో కాంగ్రెస్ బలమైన ప్రత్యామ్నాయ శక్తి అన్నారు.
Next Story