జనాలు చచ్చినా సీఎం పట్టించుకోరా?

by  |
జనాలు చచ్చినా సీఎం పట్టించుకోరా?
X

దిశ, ఆలేరు: కరోనా విజృంభిస్తున్నా సీఎం కేసీఆర్ మాత్రం ఏం పట్టనట్టు ఉన్నారని మందకృష్ణ మాదిగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా టెస్టులు సరిగ్గా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన సచివాలయం నిర్మాణం కోసం గంటల కొద్ది మీటింగ్‌లు పెట్టుకోవడానికి సమయం ఉంటుంది.. కానీ, కరోనాతో జనాలు చనిపోయినా పట్టించుకోవడం లేదన్నారు.

‘‘కరోనాపై నెల రోజుల నుంచి ఒక్కసారి కూడా సీఎం సమీక్ష చేపట్టలేదంటే ప్రజలకేమైతే మనకెందుకు.. మనం మాత్రం కొత్త సచివాలయం కట్టుకోవాలి. టెండర్లు పిలిచి ఎమ్మెల్యేలు అందరూ లాభపడాలి.’’ అంటూ ఉంది సీఎం తీరు అని విమర్శించారు. ఇప్పటికైనా కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed