దారుణం.. ఇద్దరు పిల్లలను భవనంపై నుంచి విసిరేశాడు

by  |
దారుణం.. ఇద్దరు పిల్లలను భవనంపై నుంచి విసిరేశాడు
X

దిశ, వెబ్ డెస్క్: కోల్ కతాలో ఓ దారుణం ఘటన చోటు చేసుకున్నది. కుటుంబ వివాదంతో ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలను భవనం పై నుంచి కిందకు పడేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సెంట్రల్ కొల్ కతాలోని బుర్రాబజార్ లో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనంలో నివసిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో అతనిపై కక్ష పెంచుకున్న నిందితుడు ఇద్దరు పిల్లలను భవనం పైనుంచి విసిరేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు పిల్లలను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఓ పిల్లవాడు మృతిచెందాడు. ఇంకో పిల్లవాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అదేవిధంగా అరెస్ట్ చేసిన వ్యక్తి కొద్ది రోజుల క్రితం పిల్లల తండ్రితో గొడవ పడ్డాడని విచారణలో వెల్లడైందని పోలీస్ అధికారి శర్మ తెలిపారు.



Next Story

Most Viewed