చెట్టు పైనుంచి జారి పడి.. గీత కార్మికుడు మృతి

by  |
చెట్టు పైనుంచి జారి పడి.. గీత కార్మికుడు మృతి
X

దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెట్టుమీద నుంచి జారి పడి గీత కార్మికుడు కే.ఉప్పలయ్య(55) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి రోధించిన తీరు, అందరినీ కంటనీరు తెప్పించింది. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తుచేస్తున్నారు.


Next Story

Most Viewed