- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పాలకుర్తి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. అంతేగాకుండా వైరస్ బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఘననీయంగా పెరుగుతోంది. తాగాజా జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన పూజారి చౌదరి(70) కరోనా వైరస్తో ఆదివారం మృతిచెందాడు. ఆయనకు మూడ్రోజుల క్రితం దగ్గు, జ్వరం రావడంతో సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు కరోనా పాజిటివ్ అని తేల్చగా అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజులుగా చికిత్స పొందుతూ ఆయన ఆదివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబాన్నిప్రభుత్వం ఆదుకుంటుందని జెడ్పీటీసీ శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. కరోనాతో ప్రజలు జాగత్త్రగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Next Story