కరోనా వార్త.. గుండెపోటుతో మృతి

by  |
కరోనా వార్త.. గుండెపోటుతో మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తన భార్యకు కరోనా సోకిందన్న వార్త విన్న భర్త గుండె పోటుతో మరణించాడు. భర్త మరణ వార్త విన్న భార్యకు ఆయన అంత్య క్రియలు దగ్గరుండి చేయించడం కఠినతరం అయింది. దగ్గరి బంధువులు కూడా ఎవ్వరూ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ గ్రామ సర్పంచ్ చొరవతో అతడి అంత్యక్రియలు నిర్వహించారు.

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్‌‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇదే గ్రామంలో పరమానందం దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, భార్యకు కరోనా లక్షణాలు ఉండడంతో ఈ రోజు మండలంలోని పీహెచ్‌సీకి వెళ్లి రాపిడ్ టెస్టు చేయించుకుంది. రిపోర్టులో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అదే విషయం భర్త పరమానందంకు(50) తెలిపింది. ఈ వార్త ఒక్క అతడు ఒక్కసారిగా గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు. అయితే, అతడి అంత్యక్రియలకు కరోనా అడ్డుగా రావడంతో ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇదే సమయంలో గ్రామ సర్పంచ్ లావణ్య నర్సయ్య దగ్గరుండి అతడి అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం.



Next Story

Most Viewed