కారులో వ్యక్తి సజీవదహనం

by  |
కారులో వ్యక్తి సజీవదహనం
X

దిశ, వెబ్ డెస్క్: రెండు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీహదహనమైన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాలోని నంద్యాల చాపిరేవుల దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్నాయి.

ఈ సమయంలో కారులో నుంచి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed