సీఎం పేషీలో ఉద్యోగినంటూ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

by srinivas |
సీఎం పేషీలో ఉద్యోగినంటూ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ పేషిలో ఉద్యోగినంటూ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్ టవర్స్ వద్ద నిందితుడు రాకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాకేష్ ఖమ్మం జిల్లా ప్రశాంత్ నగర్‌కు చెందినవాడిగా గుర్తించారు.

2017లో కృష్ణలంక, హైదరాబాద్‌లోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది గుంటూరు జిల్లా ముప్పాళ్లలో నేరాలకు పాల్పడిన రాకేష్.. ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. వ్యాపారి చంద్రశేఖర్‌ను రాకేష్ మోసం చేసి రూ.40 వేలు కాజేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed