‘నర్సరీలో కూలీలు జాగ్రత్తలు పాటించాలి’

by  |
‘నర్సరీలో కూలీలు జాగ్రత్తలు పాటించాలి’
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో హరితహారం నర్సరీలో పనిచేసే కూలీలు జాగ్రత్తలు పాటించాలని నాగర్ కర్నూల్ జిల్లా, లింగాల మండలం, అప్పాయిపల్లి పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రజలకు ఉపాధి హామి పథకం కింద నర్సరీలో కలుపుతీత పనులు కల్పించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. కూలీలంతా సామాజిక దూరం పాటించాలని సూచించారు. వెంకటేశ్వర్లతో పాటు మాజీ ఉప సర్పంచ్ మార్కం పర్వతాలు ఉన్నారు.
Tags: corona virus, social distance, nursury, haritha haram, panchayat secretary,


Next Story

Most Viewed