‘సామాజిక దూరం పాటించాలి’

by Shyam |   ( Updated:2020-03-25 02:03:25.0  )
‘సామాజిక దూరం పాటించాలి’
X

దిశ, మహబూబ్ నగర్: నిత్యావసర సరుకులు కొనే సమయంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా మెడికల్, కిరాణ, కూరగాయలు, పాలు విక్రయించే షాపుల ముందు మీటరు దూరంతో ఉండేలా సున్నంతో గడులను గీయించారు. అలాగే, వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు వనపర్తి సీఐ సూర్యనాయక్, పట్టణ ఎస్సై వెంకటేష్ గౌడ్, పోలీసు సిబ్బంది కరోనాపై నిత్యం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

Tags: social distance, coronavirus, spread, wanaparthy police, essential grocery stores


Next Story