- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సూపర్ స్టార్ మహేష్ బాబు.. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ప్రజలను తమను తాము కాపాడుకునేందుకు సూచనలు ఇచ్చాడు. క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తన వంతు విరాళం అందించారు. సినీ వర్కర్లను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ చారిటీకి సహాయం అందించారు. ప్రజలను కాపాడేందుకు కరోనా తో ప్రత్యక్ష పోరాటం చేసిన కరోనా వారియర్స్ డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం లాక్ డౌన్ చివరికి చేరుకోగా.. ఇక నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నాడు. త్వరలో కచ్చితంగా మంచి రోజులు వస్తాయని.. కానీ ఈ పరిస్థితులకు పూర్తిగా స్వస్తి చెప్పేందుకు మాస్క్ తప్పనిసరిగా వినియోగించాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో మాస్క్ పెట్టుకోవడం అలవాటుగా మార్చుకోవాలని చెప్తున్నారు. దీని వల్ల మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు ఇతరులను కూడా రక్షించినట్లు అవుతుందన్నారు. మాస్క్ ధరించడం కొంచెం కష్టంగా అనిపించినా ఈ సమయంలో ఇది అవసరం అన్నారు. కొత్త పరిస్థితులకు అనుగుణంగా జీవితాన్ని మార్చుకుందాం అని పిలుపునిస్తూ.. మాస్క్ ధరించి ఉన్న తన ఫొటోను షేర్ చేశాడు మహేష్. మాస్క్ ధరించడం చాలా సులభం.. నేను చేశాను.. చేస్తాను.. మరి మీరు? అని ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram
A post shared by Mahesh Babu (@urstrulymahesh) on May 22, 2020 at 12:47am PDT