సిరీస్ నిర్మాణం వైపు మహేశ్ అడుగులు..

by  |
సిరీస్ నిర్మాణం వైపు మహేశ్ అడుగులు..
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ అయింది. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ పూర్తి కాకపోవడంతో ప్రాజెక్ట్ వర్క్‌ఔట్ కాలేదు. దీంతో డైరెక్టర్ పరశురామ్‌ స్క్రిప్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేశ్.. ‘సర్కార్ వారి పాట’ సినిమా ప్రకటించాడు.

అయితే మహేశ్, వంశీ.. మహర్షి టైమ్‌లో మంచి ఫ్రెండ్స్ కావడం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్, వెబ్ సిరీస్‌లకు మంచి డిమాండ్ ఉండటంతో మహేశ్ వెబ్ సిరీస్ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న మహేశ్.. మేజర్ సినిమా ద్వారా పూర్తి నిర్మాతగా మారబోతున్నాడు. ఈ క్రమంలో సిరీస్ కాన్సెప్ట్ నచ్చడం, పైగా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండటంతో సిరీస్ నిర్మాణం వైపు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది.

కాగా, ‘సర్కార్ వారి పాట’కు కూడా మహేశ్ బాబు ఓ నిర్మాత కాగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇందులో మహేశ్ రెండు విభిన్న పాత్రలు చేయబోతున్నాడని సమాచారం.



Next Story

Most Viewed