మహారాష్ట్రలో 8,968 కేసులు.. 266 మంది మృతి

by  |
మహారాష్ట్రలో 8,968 కేసులు.. 266 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా ఒకేరోజు రాష్ట్రంలో 8,968 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతేగాకుండా ఒకే రోజు వైరస్ మూలంగా 266 మంది మృతిచెందారు.

దీంతో మొత్తంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,50,196 మందికి చేరింది. కరోనాతో ఇప్పటివరకూ 15,842 మంది మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల 1,47,018 లకు చేరాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకూ 2,87,030 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.


Next Story

Most Viewed