- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో మొదటిసారిగా కరోనా రోగికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. చెన్నైకి చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స చేశారు. గురుగ్రామ్ కు చెందిన 48 ఏళ్ల ఓ వ్యక్తి గతకొంతకాలంగా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన వైద్యులు అతడికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స చేయాల్సిందిగా గుర్తించారు. ఈ క్రమంలో అతడికి ఊపిరితిత్తులు మార్పిడి శస్త్రచికిత్స చేశారు.
ఈ విషయమై శస్త్రచికిత్సలో పాల్గొన్న డాక్టర్ మాట్లాడుతూ.. పేషెంట్ కు విజవంతంగా ఆపరేషన్ చేయగలిగామని, అతడికి కరోనా సోకిందని.. ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుని శస్త్ర చికిత్స చేసినట్లు చెప్పారు. చెన్నైలోని మరో ప్రైవేట్ హాస్పిటల్లో మెదడు చనిపోయిన దాత నుండి ఊపిరితిత్తులను సేకరించి ఇతడికి మార్పిడి చేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు.