లారీడ్రైవర్ శంకర్ ఆచూకీ లభ్యం..

by  |
లారీడ్రైవర్ శంకర్ ఆచూకీ లభ్యం..
X

దిశ, హుస్నాబాద్ : ఎట్టకేలకు గల్లంతైన లారీడ్రైవర్ శంకర్ ఆచూకీ లభ్యమైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలోని ఓ బట్టి మడుగులో అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

ఇదిలాఉండగా, గత వారంరోజుల కిందట హుస్నాబాద్ మండలంలో పొటెత్తిన భారీ వరదల్లో లారీ‌తో పాటు డ్రైవర్ శంకర్ గల్లంతైన విషయం తెలిసిందే.అప్పటినుంచి సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినా, ఎంతకూ అతని ఆచూకీ లభ్యం కాలేదు. కాగా, ఇవాళ ఉదయం బస్వాపూర్ గ్రామస్తులు డ్రైవర్ శంకర్ మృతదేహాన్ని ఓ బట్టి మడుగులో గుర్తించడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు తెరపడింది.


Next Story