ప్రకాశం వాసులకు గుంటూరులో ఘోర ప్రమాదం 

by  |
ప్రకాశం వాసులకు గుంటూరులో ఘోర ప్రమాదం 
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా, ఈపూరు మండలం కొండ్రముట్ల వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి తుఫాన్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

బాధితులు ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన వారుగా సమాచారం అందుతోంది. క్షతగాత్రులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed