గ్యాస్ లీక్ ఘటనపై లోకేశ్ దిగ్భ్రాంతి

by  |
గ్యాస్ లీక్ ఘటనపై లోకేశ్ దిగ్భ్రాంతి
X

దిశ, అమరావతి బ్యూరో: విశాఖ ఫార్మా కంపెనీ సాయినార్ కెమికల్స్ గ్యాస్ లీకేజ్ ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరవకముందే మరో ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం పట్ల లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. గ్యాస్ లీకేజ్ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు


Next Story

Most Viewed