రేపటి నుంచి సూర్యాపేటలో..

by  |
రేపటి నుంచి సూర్యాపేటలో..
X

దిశ సూర్యాపేట: కరోనా వైరస్ జిల్లాలో విజృంభిస్తున్న కారణంగా రేపటి నుంచి నుండి ఈనెల 31 వరకు జిల్లా కేంద్రంలో కిరాణా షాపులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ చేపడుతున్నట్లు సూర్యాపేట కిరాణా ఫ్యాన్సీ జనరల్ మర్చంట్ అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ మర్చంట్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కరోనా జిల్లాలో చాపకింద నీరు లాగా వైరస్ వ్యాప్తి చెందుతున్నా నేపథ్యంలో పట్టణంలోని కిరాణా షాపు నిర్వాహకులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను చేపడుతామని, ఉదయం 7నుండి 2మధ్యాహ్నం వరకు మాత్రమే దుకాణాలు తెరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో వాసా శ్రీశైలం వెన్నెల రామచంద్రరెడ్డి పలు కిరాణ దుకాణం నిర్వాహకులు పాల్గొన్నారు.



Next Story