- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్లోని బీజేపీ నేతలకు ప్రాణ భయం పట్టుకుంది. నెల రోజుల వ్యవధిలో ఆ పార్టీకి చెందిన ఆరుగురు నేతలపై దాడులు జరుగగా ఐదుగురు చనిపోయారు. జూలై 8న బీజేపీకి చెందిన బందిపొరా నేత వసీం బారితో పాటు ఆయన తండ్రి బషిర్ షేక్, సోదరుడు ఉమర్ షేక్ హత్య గావింపబడ్డారు. ఆగస్టు 4న దక్షిణ కశ్మీర్ లోని అఖారన్ పంచాయతీకి చెందిన బీజేపీ సభ్యుడు ఆరిఫ్ అహ్మద్పై దుండగులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
ఆగస్టు 6న ఖాజీగుండ్ ప్రాంతంలో బీజేపీ నేత, సర్పంచ్ అయిన సాజిద్ ఖాండేను ఆయన ఇంటి బయట ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. ఆగస్టు 9న బుద్గామ్లోని ఓంపారాలో బీజేపీ నేత అబ్దుల్ హమీద్ నాజర్ చంపబడ్డారు. స్థానిక సంస్థలకు చెందిన బీజేపీ నేతలను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తుండటంతో వారిని ప్రాణభయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా తమకు రక్షణ జోన్లు ఏర్పాటు చేయాలని పాలక యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని వర్తింపజేసే ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏడాదిన రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఇది జరిగి ఏడాదైన సందర్భంగా జమ్ముకశ్మీర్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిచ్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదే తరుణంలో స్థానిక బీజేపీ నేతలు వరుసగా హత్యకు గురవుతుండడంతో భయాందోళన చెందుతున్న కొందరు నేతలు తమ పదవులకు సైతం రాజీనామా చేస్తున్నారు.