దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారు

by  |
దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు ఒక వరం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం లబ్ధిదారులకు ఆయన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను నల్లగొండలోని తన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ..

గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా, తెలంగాణ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రపంచం గుర్తించే విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందబోతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారని కొనియాడారు.



Next Story