‘నిరాశ్రయులను ప్రభుత్వం ఆదుకోవాలని’

by  |
‘నిరాశ్రయులను ప్రభుత్వం ఆదుకోవాలని’
X

దిశ, ముషీరాబాద్: కరోనా మహమ్మారితో అతలాకుతలమైన చేతి వృత్తి దారులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని సంఘం సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు ఫైళ్ల ఆశయ్య విమర్శించారు. గోల్కొండ క్రాస్ రోడ్‌లోని సంఘం కార్యాలయంలో గురువారం చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ… ప్రభుత్వాలు చేతి వృత్తిదారుల కుటుంబాలకు రూ.10 వేల ఆర్థికసాయం అందించాలని, ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ పరిధిలో నిర్మించనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అర్హతగల వృత్తిదారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.


Next Story

Most Viewed