పిడుగుపాటుకు యువకుడు మృతి

by Sridhar Babu |   ( Updated:2020-06-03 11:02:12.0  )
పిడుగుపాటుకు యువకుడు మృతి
X

దిశ‌, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం వలన పిడుగు పాటుకు గురై ఓ యువకుడు మృతి చెందాడు.ఈ ఘటన వేంసూరు మండలం దుద్దేపూడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం..బయట తన పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న జి.లక్ష్మణ్ రావు(25)పై ప్రమాదవశాత్తు పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు.



Next Story

Most Viewed