21 డేస్ చాలెంజ్ విసిరిన లావణ్య

by  |
21 డేస్ చాలెంజ్ విసిరిన లావణ్య
X

దిశ, వెబ్ డెస్క్: లాక్‌డౌన్‌లో తాను ఏం చేసినా.. తన ప్రియమైన అభిమానులతో పంచుకుంటోంది సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. కరోనా నేపథ్యంలో ‘రెడ్ ట్రీ’ పేరుతో మాస్క్‌లు కూడా తయారు చేసింది. షూటింగ్‌లు లేకపోవడంతో ఇంట్లోనే హ్యాపీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడుకి తనను సంతోషపెట్టిన విషయాలను అభిమానులతో పంచుకునేందుకు 21 డేస్ చాలెంజ్‌ను మొదలు పెట్టింది.

లావణ్య త్రిపాఠికి ఓ ఎకో ఫ్రెండ్లీ సంస్థ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తాము పర్యావరణ హితమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నట్లు, లావణ్యకు ప్రేమతో కొన్ని వస్తువులు సెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ సంస్థ నుంచి ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ లావణ్య తలుపు తట్టాయి. ఈ విషయాన్ని లావణ్య తన ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. అంతేకాదు ఈ హ్యాపీ మూడ్‌లో ఓ చాలెంజ్ కూడా చేపట్టింది. అదే ‘21 డేస్ చాలెంజ్’. రోజులో తనను సంతోషపెట్టిన ఒకానొక విషయాన్ని లేదా సంఘటనను 21 రోజుల పాటు అభిమానులతో పంచుకుంటున్నానని, అందులో ఇదే మొదటిదని తెలిపింది. లావణ్య క్వారంటైన్‌ను ఫుల్ హ్యాపీగా గడిపేస్తోంది. మొన్నటి వరకు హైదరాబాద్‌లోనే ఉన్న ఈ బ్యూటీ.. ముఖానికి మాస్క్, క‌ండ్లకు స్పెష‌ల్ గ్లాసెస్, ఒంటికి పీపీఈ కిట్ ధ‌రించి హైద‌రాబాద్ నుంచి డెహ్రాడూన్‌లోని త‌న ఇంటికి కారులో వెళ్లింది. తన ప్రియమైన కుక్కతో డ్యాన్స్ చేస్తూ ‘మోర్ హ్యూమన్ దెన్ మోస్ట్ హ్యుమన్స్’ అంటూ ఆ కుక్క గురించి చెప్పుకొచ్చింది. అంతేకాదు. వేడి వేడి మెంతి పకోడాలు చేసుకోవడంతో పాటు, మార్నింగ్ కాఫీ రుచులను తన అభిమానులతో పంచుకుంది.


Next Story

Most Viewed