- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: విధి ఎవ్వరిని ఏ విధంగా ఆడుకుంటుందో తెలియదు. ఎవరు ఎన్ని బాధలకు గురవుతారో తెలియదు. అంతేకాదు ఎందరిని ఒంటరిని చేసిన కష్టాల ఒడిన నెట్టేస్తుందో తెలియదు. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నా అభంశుభం తెలియని ఎందరో చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. తాజాగా సిరిసిల్లాలో ఓ విషాదం చోటు చేసుకుంది. దీంతో ప్రతి ఒక్కరూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ చిన్నారికి అపన్న హస్తం అందించాలని ప్రతి ఒక్కరూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండలానికి చెందిన అంజవ్వకు, జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపల్లి గ్రామనికి చెందిన మామిడి భూమయ్యకు కొన్ని సంవత్సరాల పెళ్లి అయ్యింది. వీరికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు సంజన(9). అయితే, వీరివురూ కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో సంవత్సరం క్రితం అంజయ్య టీబీ వ్యాధీతో చనిపొయాడు. దీంతో భార్య అంజవ్వ రుద్రంగిలో ఉంటూ కూలీ చేసుకుంటూ కూతురిని పోషిస్తూ జీవన సాగిస్తోంది. అయితే, అంజవ్వ కూడా గురువారం పసిరికలతో మృతిచెందింది. దీంతో కూతురు సంజన అనాథగా మారింది. ‘అమ్మా నువ్వు కుడా నన్ను వదిలేసి వెళ్లావా’ అని సంజన రోధించడం అక్కడున్న వారినిని కంటతడి పెట్టించింది. తల్లిదండ్రులు మృతిచెంది అనాథగా మారిన ఈ బాలికన ఎవరైన దాతలు గానీ ప్రభుత్వం గానీ ఆదుకోవాలని కోరుతున్నారు.