పాము కరిచి కొడుకు మృతి, తండ్రి సీరియస్

by  |
పాము కరిచి కొడుకు మృతి, తండ్రి సీరియస్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తండ్రీకొడుకులను పాము కరవడంతో కొడుకు మృతి చెంది.. తండ్రి పరిస్థితి సీరియస్ గా ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ నగరంలోని 5వ డివిజన్ పరిధిలోని గూడెంలో చరణ్, నాగరాజు అనే వీరిద్దరూ తండ్రీ కొడుకులు. అయితే వీరిద్దరూ గురువారం రాత్రి ఇంటిలో నిద్రపోయారు. ఇలా నిద్ర పోతున్న తండ్రీకొడుకులను శుక్రవారం తెల్లారుజామున పాము కాటేసింది. కొడుకు చరణ్ (12) అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి నాగరాజు సీరియస్ గా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed