- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: కోదాడ పట్టణంలో నకలీ ఆర్ఎంపీ మాయాజాలం బట్టబయలైంది. ఆయన వ్యవహారం పరిశీలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. అతను చదివింది పదో తరగతి మాత్రమే.. కానీ, ఎంబీబీఎస్ డాక్టర్ లా ఆయన ప్రవర్తన ఉంటది. వివరాల్లోకి వెళితే.. కోదాడ పట్టణంలో ఓ వ్యక్తి క్లినిక్ సెంటర్ ను ఏర్పాటు చేశాడు. గతకొన్నాళ్ల నుంచి ఈ క్లినిక్ ను నడుపుతున్నాడు.
అయితే, తాజాగా తన మాయాజాలంతో కరోనా కాసులు సంపాదించుకునేందుకు ప్రయత్నించి బుక్కయ్యాడు. ఈ క్లినిక్ లో అతను నకలీ కరోనా టెస్టులు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం దిశ ప్రతినిధికి తెలియడంతో అతడి మాయాజాలం ఉదంతాన్ని బట్టబయలు చేశారు. ఈ విషయం తెలిసిన ప్రజలు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story