ఆ పనుల్లో జాప్యం ఒద్దు: ఎంపీడీవో

by  |
ఆ పనుల్లో జాప్యం ఒద్దు: ఎంపీడీవో
X

దిశ, హుస్నాబాద్: మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీడీఓ ఓబులేష్ అన్నారు. బుధవారం బెజ్జంకి ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి పనులపై పంచాయతీ సెక్రెటరీలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ తరగతిలో ఆయన మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ పనులను గ్రామ కార్యదర్శులకు అప్పగించగా వారు కూలీలతో క్షేత్రస్థాయిలో పనులను నిర్వహించే క్రమంలో కార్యదర్శులు పలు సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, సిద్దిపేట ఏపీఓ రాములు, అక్కన్నపేట ప్రభాకర్, పంచాయతీ సెక్రెటరీలు తదితరుల పాల్గొన్నారు.


Next Story

Most Viewed