రహదారిపై డీఈతోపాటు సీఐ.. ఎందుకు..?

by  |
రహదారిపై డీఈతోపాటు సీఐ.. ఎందుకు..?
X

దిశ, చెన్నూరు: చెన్నూర్ నుండి మహారాష్ట్ర వెళ్లే జాతీయ రహదారిపై గత నెల రోజులలో జరిగిన ప్రమాదాలలో పది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదాలకు కారణాలు తెలుసుకొని వాటిని నియంత్రించే కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారులను డీఈ అన్నయ్యతో కలిసి రూరల్ సీఐ నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని రహదారిపై గల చింతలపల్లి, పారుపల్లి, బోరంపల్లి, కొల్లూరు రాంపూర్, దేవులవాడ, లక్ష్మీపూర్, గ్రామాల వద్ద బారీకేడ్లను, కల్వర్టుల వద్ద రేడియం సూచికలను, రోడ్డు సిరిగాలేని వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించే చర్యలను చేపడతామని వారు తెలిపారు.


Next Story

Most Viewed